ఉమేశ్‌ను పించ్‌ హిట్టర్‌గా పంపిస్తా : కోహ్లి

ఉమేశ్‌ను పించ్‌ హిట్టర్‌గా పంపిస్తా : కోహ్లి


న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భారత పేస్‌ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. 'ఉమేశ్‌ ఆటతీరు చూస్తుంటే టెస్టుల్లో పించ్‌ హిట్టర్‌గా నెంబర్‌ 3వ స్థానంలో పంపించాలని ఉందని' కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది టెస్టు ఫార్మాట్‌లో పునరాగమనం చేసిన ఉమేశ్‌ బంతితో పాటు బ్యాట్‌తోనూ అదరగొడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌కు గాయంతో దూరమైన జస్‌ప్రీత్‌ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేశ్‌ నాలుగు టెస్టుల్లో 13.65 సగటుతో 23 వికెట్లు పడగొట్టాడు. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ ప్రారంభమైన తర్వాత కనీసం నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితా ప్రకారం ఉమేశ్‌ 23.1 సగటును నమోదు చేసి బెస్ట్‌ బౌలర్‌గా నిలిచాడు.